కంటెస్టంట్లతో ఆటాడుకున్న .. స్టార్ మహిళ సుమ !
తొలి రౌండ్ ప్రారంభం అవుతుంది పేరు జంబ లకిడి పంబ. కంటెస్టంట్లను ప్రశ్నలు అడుగుతారు సమాధానం తెలిసిన వాటికి రాంగ్ జవాబులు చెప్పాలి. భానుశ్రీ 60 పాయింట్లు, అర్చన 60 పాయింట్లు, శిరీష 70 పాయింట్లు, సౌజన్య 80 పాయింట్లను పొందారు. రెండో రౌండ్ వారెవా ఏమి ఫేసు. ఈ రౌండ్లో ఒక్కక్కరికీ నలుగురు ఫేసులతో మిర్జ్ చేసిన ఫొటో చూపిస్తారు సుమ. వారు ఎవరో కరెక్టు సమాధానం చెప్పాలి. ఈ రౌండ్లో భానుశ్రీ 40 పాయింట్లు, అర్చన 40, శిరీష 30, సౌజన్య 40 పాయింట్లు పొందుతారు. తొలి, రెండు రౌండ్ల కలిపి స్కోరులు.. సౌజన్య 120 పాయింట్లు, శిరీష 100, భానుశ్రీ 100, అర్చన 100 పాయింట్లు పొందుతారు. రెండోరౌండ్లో సౌజన్య లీడ్లో ఉంటారు.
మూడో రౌండ్ వదల బొమ్మాళి వదల.. ఒక్కో సెట్లో తొమ్మిది ఫొటోలుంటాయి. మూడు కశ్వన్ మార్కులు వస్తాయి. ఆ క్వశ్చన్ మార్కుల్లో ఏ ఫొటో ఉందో చెప్పాలి. కరెక్టుగా చెబితే పది పాయింట్లు అంటారు సుమ. ఈ రౌండ్ పూర్తయ్య సరికి భానుశ్రీ 110, అర్చన 90, శిరీష 100, సౌజన్య 130. ఈ మూడో రౌండ్ పూర్తయ్యే సరికి సౌజన్నే లీడ్లో ఉంటారు.
నాలుగో రౌండ్ రాస్కోరా సాంబ. డైలాగ్ వినిపిస్తారు.అది ఎవరో చెప్పాలి. హీరో? డైరెక్టర్? గురించి ప్రశ్నలు వేశారు. ఈ రెండు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు శిరీష, సౌజన్య చెబుతారు. మరో రెండు ప్రశ్నలు వేశారు. సౌజన్య, శిరీషయే జవాబు చెబుతారు. ఇంకొక మరో రెండు ప్రశ్నలకు శిరీషయే జవాబునిచ్చారు. ఈ రౌండ్లో సౌజన్య, శిరీష ఇద్దరి ఒకే స్కోర్స్ సమానంగా ఉంటాయి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాంరాలో అధిక పాయింట్లను సౌజన్య పొందుతారు. ఆమె ఎపిసోడ్ విన్నర్గా నిలుస్తారు.