బాలీవుడ్ హీరోలనే భయపెడుతున్న ప్రభాస్..!

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించాడు. ఆ సినిమా ఏకంగా 1800 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అన్ని ఇండస్ట్రీ ల లోను రికార్డు స్థాయిలో కలెక్షన్ లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మించారు.  తర్వాత సాహో సినిమా తీసుకొని మిక్స్డ్ టాక్ తో నే 400 కోట్లు రాబట్టాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ తెరకెక్కించాడు.

 
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాథే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ డ్రామా చిత్రం చేస్తున్న ప్రభాస్ మరో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న 50 వ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు.ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే తన 22వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసాడు.

 
గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మైతలాజికల్ సోషియో ఫాంటసీకి ‘ఆది పురుష్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు ఈయన కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇదిలా ఉండగా.. ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణా మూవీస్’ వారు నిర్మిస్తుండగా..ఈ ప్రాజెక్టు కు 250కోట్ల బడ్జెట్ అవుతుందని సమాచారం. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

 
ఈ చిత్రం బడ్జెట్ 400కోట్ల వరకూ అవుతుందట. ఇక ‘ఆది పురుష్’ చిత్రానికి 600 కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని సమాచారం. సో మొత్తంగా ఈ 3 సినిమాలకు కలిపి 1000 కోట్ల పైనే బడ్జెట్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సూపర్ స్టార్ నటించిన 3 సినిమాలకు ఈ రేంజ్లో బడ్జెట్ పెట్టలేదు. దీంతో ప్రభాస్ క్రేజ్ ను చూసి బాలీవుడ్ హీరోలు కూడా భయపడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: