'అరవింద" కాంబినేషన్ను ట్రై చేస్తున్న త్రివిక్రమ్

Naga Sai Ramya
రాజమౌళి అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా గురించి ప్రేక్షకుల్లో ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సరిగ్గా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి త్రివిక్రమ్ అలాగే ఎన్టీఆర్ కాంబినేషన్ కి వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ "అరవింద సమేత"తో అభిమానులను అలరించారు. మరోసారి వీరిద్దరూ ఓ వెరైటీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు అభిమానులను అలరిస్తున్నాయి.
రీసెంట్ గా ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది. "అరవింద సమేత"లో ఎన్టీఆర్ అలాగే పూజా హెగ్డే కెమిస్ట్రీ హైలైట్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మళ్ళీ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఇద్దరూ మళ్ళీ కలిసి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఇద్దరితో సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ ప్రయత్నం సఫలమైతే "అరవింద సమేత" కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాను సమకాలీన రాజకీయాలపై సెటైరికల్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంతకు ముందు జాన్వీను అలాగే కియారాను ఎన్టీఆర్ కు జోడీగా ఎన్నుకోవాలని భావించారు. ఫైనల్ గా పూజా పేరును ఫిక్స్ చేశారని టాక్.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అటు కోలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్స్ ను దక్కించుకుంటోంది. "మాస్టర్"తో సత్తా చూపెట్టిన విజయ్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యువకెరటం అనిరుధ్ మ్యూజిక్ ను కంపోజ్ చేస్తాడు. ప్రస్తుతం విజయ్ తన రీసెంట్ హిట్ "మాస్టర్" సక్సెస్ ను ఆస్వాదిస్తున్నాడు. వచ్చే ఏడాదికి ఇంతకు మించిన బ్లాక్ బస్టర్ ను అందించాలని భావిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: