సినిమా హాళ్లు తెరిచేది లేదు.. యాజమాన్యాల నిర్ణయం.. ప్రేక్షకులను నిరాశ..?

praveen
కరోనా పుణ్యమా అని అన్ని రకాల కార్యకలాపాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక కరోనా  వెలుగులోకి వచ్చిన తర్వాత నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించింది. ఇక ఈ లాక్ డౌన్ ప్రకటన తర్వాత అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక ఈ క్రమంలోనే సినిమా షూటింగులు అన్ని నిలిచి పోవడంతో పాటు సినిమా థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే. కరోనా  వెలుగులోకి వచ్చి ఆరు నెలలకు పైగా గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా సినిమా థియేటర్లు తెరుచుకోలేదు. ఇక ఆ తర్వాత అన్లాక్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రమ క్రమంగా అన్ని రకాల కార్యకలాపాలకు సంబంధించిన అనుమతుల ఇస్తూ కరోనా  వ్యాప్తి దృశ్య నిబంధనల మధ్య కార్యకలాపాలు నిర్వహించాలని ఆయా సంస్థలకు సూచించిన విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే సినీ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా థియేటర్ల ప్రారంభం నేటి నుండి  జరగనుంది. 50% కెపాసిటీతో సినిమా థియేటర్లను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలను సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ఆయా చిత్ర బృందాలు సిద్ధమవుతుండగా... ఇక థియేటర్లను కఠిన నిబంధనల మధ్య నిర్వహించేందుకు  యాజమాన్యాలు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.



 ఇదిలా ఉంటే... సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. అటు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం తాము 50% కెపాసిటీతో సినిమా థియేటర్లు నిర్వహించేలా  అయితే థియేటర్లు తెరవలేము  అంటూ స్పష్టం చేస్తున్నారట. ఇన్ని రోజుల వరకు సినిమా థియేటర్లను మెయింటెన్ చేసి ఎంతో నష్టాల్లో కూరుకు పోయాము  అంటూ చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు 50% కెపాసిటీతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసి నడిపించడం ఎంతో కష్టతరమైన పని అంటూ చెబుతున్నారట. అందుకే ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా థియేటర్లను తెరవడం లేదు అంటూ సమాధానం ఇస్తున్నారట సినిమా థియేటర్ల యాజమాన్యాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: