వీళ్లకి లాక్ డౌన్ గట్టి పాఠం నేర్పించిందా..?
లాక్ డౌన్ లో ఇంటి నుండి పనిచేయడం మొదలుపెట్టారు యాంకర్లు. ఈ క్రమంలోం వారు సొంత యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. వారికి ఉన్న ఫాలోయింగ్ కు ఎలా అయినా ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఇదే జోష్ తో టాప్ యాంకర్స్ అంతా తమ యూట్యూబ్ ఛానెల్స్ తో సందడి చేస్తున్నారు. తెలుగు టాప్ యాంకర్ సుమ, శ్రీముఖి లాంటి వారు కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టి సర్ ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ తో పాపులర్ అయిన జోతి కూడా యూట్యూబ్ ఛానెల్ తో షాక్ ఇచ్చింది.
ఎప్పుడు క్షణం తీరిక లేకుండా నిత్యం షూటింగులతో బిజీగా ఉంటారు కాబట్టే వారు లాక్ డౌన్ టైం లో నాలుగైదు నెలల గ్యాప్ భరించలేకపోయారు. వారికి ఉన్న క్రేజ్ తో జస్ట్ వారు ఎలాంటి వీడియోస్ పెట్టినా లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. అంతేకాదు ఊహించని విధంగా పే కూడా వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి లాక్ డౌన్ టైం వారికి మరో అవకాశాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.