వీళ్లకి లాక్ డౌన్ గట్టి పాఠం నేర్పించిందా..?

shami
కరోనా వల్ల చాలామందికి చాలా విషయాలు నేర్పించింది. సినిమా వాళ్లకేమో కాని స్మాల్ స్క్రీన్ వారికి మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. ప్రతిరోజు టివిలో కనిపించే యాంకర్స్ కు అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు రకరకాల షోలతో సందడి చేసే యాంకర్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ టైం లో వారిని వారే ప్రశ్నించుకున్నారు అందుకే వారు తమ ప్లాన్ మార్చేసుకున్నారు.
లాక్ డౌన్ లో ఇంటి నుండి పనిచేయడం మొదలుపెట్టారు యాంకర్లు. ఈ క్రమంలోం వారు సొంత యూట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేశారు. వారికి ఉన్న ఫాలోయింగ్ కు ఎలా అయినా ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఇదే జోష్ తో టాప్ యాంకర్స్ అంతా తమ యూట్యూబ్ ఛానెల్స్ తో సందడి చేస్తున్నారు. తెలుగు టాప్ యాంకర్ సుమ, శ్రీముఖి లాంటి వారు కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టి సర్ ప్రైజ్ చేశారు. బిగ్ బాస్ తో పాపులర్ అయిన జోతి కూడా యూట్యూబ్ ఛానెల్ తో షాక్ ఇచ్చింది.
ఎప్పుడు క్షణం తీరిక లేకుండా నిత్యం షూటింగులతో బిజీగా ఉంటారు కాబట్టే వారు లాక్ డౌన్ టైం లో నాలుగైదు నెలల గ్యాప్ భరించలేకపోయారు. వారికి ఉన్న క్రేజ్ తో జస్ట్ వారు ఎలాంటి వీడియోస్ పెట్టినా లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. అంతేకాదు ఊహించని విధంగా పే కూడా వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి లాక్ డౌన్ టైం వారికి మరో అవకాశాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: