గుంటూరు టాకీస్ కాదు అంతకు మించి.. ?
ఈ చిత్రంలో నందు జోడీగా జబర్దస్త్ బ్యూటీ రష్మీ నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'బొమ్మ బ్లాక్బస్టర్' సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పనులు చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్పై దృష్టి పెట్టిన చిత్రయూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా రష్మీకి ఘాటు ముద్దిస్తున్న నందు లుక్ రిలీజ్ చేస్తూ అక్టోబర్ 19వ తేదీన ఉదయం 10 గంటలకు 'బొమ్మ బ్లాక్బస్టర్' సినిమా లోని మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఈ పోస్టర్లో రష్మీ- నందు ఘాటు రొమాన్స్ చూసి తొందరగా ఆ పాట చూడాలని కుతూహల పడుతున్నారు ఆడియన్స్.
ఇకపోతే ఇటీవలే విడుదలైన 'బొమ్మ బ్లాక్బస్టర్' టీజర్తో బొమ్మ దద్దరిల్లిపోయింది. పోతురాజుగా హీరో నందు, పోతురాజు గాడి లవర్ వాణిగా హీరోయిన్ రష్మీ విలక్షణ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. చూడాలి మరి రష్మీ- నందు జోడీతో బొమ్మ ఏ మేర బ్లాక్బస్టర్ అవుతుందనేది. జబర్దస్త్ పాపకి ఈ సారి అయిన కలిసి వస్తుందో చూడాలి.