జబర్డస్త్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..!

Kothuru Ram Kumar
బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్న షో జబర్దస్త్. ఈ షో గురించి తెలియని తెలుగువారంటూ ఎవరు ఉండరు. ఈ షో ద్వారా ఎంతో మంది జీవనోపాధిని పొందుతున్నారు. అంతేకాదు.. సినీ పరిశ్రమకు మంచి కామెడియన్స్ ని కూడా అందించింది. ఈ షో నుండి చాల మంది కామెడియన్స్ వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ వెండితెరపై కూడా కనువిందు చేస్తున్నారు. అయితే జబర్దస్త్ గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందామా.
ఈ షో మొత్తం యాంకర్ నవ్వుతూనే ఉంటుంది. అయితే వాళ్ళు దానిని ముందే ప్రిపేర్ చేసి కేప్చర్ చేసి పెట్టుకుంటారు. దానిని ఎడిటింగ్ లో యాడ్ చేస్తారు. ఇక ఈ షోలో ఇదివరకు న్యాయనిర్ణేతలు రోజ, నాగబాబు.. అలాగే ప్రస్తుతం ఉన్న మనూ, రోజా నవ్వులు కొన్ని ఒరిజినల్ ఉంటాయి. మరికొన్ని మాత్రం స్టాక్ సౌండ్స్ గా పక్కన పెట్టుకొని ఆర్టిస్ట్ స్క్రీన్ మీద కనపడగానే పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇదివరకు నాగబాబు కౌంటర్లు మాత్రం ఇన్స్టెంట్ గా ఉండేవి. అంతేకాదు రష్మీ,అనసూయ మీద వేసే కౌంటర్లను మాత్రం ముందే తెలియజేస్తారు. అందుకే వారు లైట్ తీసుకోని అదిరిపోయే ఎక్స్ ప్రెషన్ ఇస్తుంటారు. అంతేకాదు ప్రొడక్షన్ మీద వేసే జోకులు కూడా ముందే మాట్లాడుకొని పెడతారట. ప్రతి టీం కి రైటర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది.
ఈ షోలో కొన్ని స్కిట్ లకు బలవంతంగా నవ్వులు పుట్టిస్తారు. ఇక మార్కులు ఇచ్చే విషయంలో న్యాయనిర్ణేతలు పూర్తిగా స్వాతంత్రం ఉంటుంది. ఇక అప్పుడప్పుడు వచ్చే గెస్ట్ లకు ఏమి ఇవ్వరు. యాంకర్ పార్ట్ ని సపరేట్ గా తీసుకోని ఆ తర్వాత కలిపేస్తారు. ఎందుకంటే రష్మీకి తెలుగు రాదు. ఆమె ఆ నాలుగు మాటలు చెప్పటానికే ఎక్కవ టేకులు తీసుకుంటుంది. ఈ లోపు స్కిట్ చేసేవారికి ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోతుందని అందుకే ఆలా చేస్తుంటారు. ఈ షో యాంకర్ రష్మీకి పారితోషికాలు కూడా చాలా ఎక్కువగానే ఇస్తారు. అనసూయ, రేష్మి లకు టెంప్టింగ్ పేమెంట్ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: