ఆ డైరెక్టర్ కి గుడ్ న్యూస్ చెప్పిన అనుష్క.. ఫ్యాన్స్ కి పండగే !

Chaganti
టాలీవుడ్‌ లో విలక్షణమైన, చారిత్రక, పౌరాణిక చిత్రాలను అందించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకరయిన గుణశేఖర్ రానా దగ్గుబాటితో హిరణ్యకశ్యప మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గుణ శేఖర్ అది కాక తను తీసే మరో సినిమాను అనౌన్స్ చేశాడు. గుణశేఖర్ తీయనున్న తర్వాతి సినిమా పేరు శాకుంతలం. వెండితెర మీద భారతాన ఆది పర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ 'శాకుంతలం' ని తాను రూపొందించనున్నానని ఆయన పేర్కొన్నారు.
భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అయిన హిరణ్యకశ్యప సినిమా ప్రీ - ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, అయితే కరోనా తెచ్చిన తంటాలతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని ఆయన ప్రకటించారు. ఆ మధ్య రుద్రమ దేవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 5 ఏళ్లు పూర్తి అయిన నేపధ్యంలో అనుష్క విష్ చేసిన నేపధ్యంలో మీ శాకుంతలం సినిమాలో అనుష్కని తీసుకొండని కొందరు రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే వారి కోరిక ఫలించిందని అంటున్నారు. శాకుంతలం సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించనుందని అంటున్నారు.
మొదట ఈ పాత్రకు గానూ పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె అంతగా ఆసక్తిని చూపలేదని అన్నారు. ఆ తరువాత అనుష్కను సంప్రదించగా దానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి అనుష్క, గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమా చేసింది. గుణశేఖర్ మీద ఆమెకు మంచి గురి ఉండడంతో ఇప్పుడు శాకుంతలంకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అనుష్క ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: