సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలోకి దిగుతున్న సినిమాలు ఇవే..
ఇదిలా ఉండగా ఇప్పటివరకు కొన్ని చిత్రాల షూటింగు పూర్తి కాగా మరికొన్ని సినిమాల షూటింగ్ లు తుది దశలో ఉన్నాయి. దగ్గుబాటి రానా నటిస్తున్న అరణ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. సాయిధరమ్ తేజ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు వినికిడి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఐతే పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ నవంబర్ మూడో వారం లోపు పూర్తి చేస్తారని విశ్వసనీయ సమాచారం. చిరంజీవి మాత్రం తన ఆచార్య సినిమాను ఇప్పట్లో పూర్తిచేయాలని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే సాయి ధరమ్ తేజ్, దగ్గుబాటి రానా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి మరికొన్ని సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.