గ్రాండ్ గా రఘు కుంచె కూతురి పెళ్లి..
రాత్రి 9:50 గంటలకు ముహూర్తం కాగా ఈ వివాహ శుభ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయినట్టు చెబుతున్నారు. లాక్డౌన్ విధించిన తరువాత చిరంజీవి మరియు రామ్ చరణ్ వివాహ వేడుకలకు హాజరు కావడం ఇదే మొదటి సారి అని అంటున్నారు. వారు యువ జంట రాగ పుష్యమి - ఆశిష్ వర్మలను ఆశీర్వదించారు.
అయితే ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకని పెద్ద హంగామా లేకుండా కానిచ్చేశారు. సామాజిక దూర నిబంధనలు మరియు ఇతర భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ వివాహాన్ని ప్లాన్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ గా ఆయన సుమారు పది సినిమాలు చేశారు. అందులో ముందుగా బంపర్ ఆఫర్ సినిమా చేయగాఆ తరువాత ఆహ నా పెళ్ళంట, దేవుడు చేసిన మనుషులు, పలాస 1978 సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి.