ఫ్యామిలీకి దూరంగా అల్లు అర్జున్.. ఎందుకంటే..?
గతంలో ఒకటి రెండు పాటలకోసం, కొన్ని సీన్లకోసం మాత్రమే ఈ అటవీ ప్రాంతానికి సినిమావాళ్లు వచ్చేవారు. అయితే ఏకంగా నెలరోజులపాటు షూటింగ్ అంటే.. అల్లు అర్జున్ సినిమా అనే చెప్పాలి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. అల్లు అర్జున్ మాస్ పాత్రలో, పుష్పరాజ్ అనే యువకుడిగా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుంది. ఈ ఇద్దరూ కూడా సినిమాలో చిత్తూరు యాస మాట్లాడతారట. దీనికోసం ఆల్రడీ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. మారేడు మిల్లి అడవుల్లో నెల రోజులపాటు కీలకమైన సన్నివేశాలతో పాటు పాట కూడా తెరకెక్కిస్తారు.
ఇక ఈ సినిమా షూటింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. సెట్స్ లోకి వచ్చిన తర్వాతే అందరికీ కరోనా టెస్ట్ చేయిస్తారట. ఎలాంటి అనుమానం ఉన్నా.. టీమ్ లో కీలకమైన వ్యక్తులైనా సరే.. బైట పెట్టేస్తారని టాక్. పూర్తి జాగ్రత్తలతోటే పుష్ప సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.