పవన్ కల్యాణ్ ముందు ప్రభాస్ బలాదూర్..

Deekshitha Reddy
ఏ సినిమాకి ఎంత తీసుకుంటున్నారనేదానికంటే.. ఏడాదిలో ఎన్ని సినిమాలు చేశారు, ఎంత సంపాదించారు, రోజుకి ఆ నటుడి సంపాదన ఎంత.. అనేదే చాలా ముఖ్యం. అలా చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లు కూడా హీరో పవన్ కల్యాణ్ ముందు దిగదుడుపేనని చెప్పాలి.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఒక్కో సినిమాకి తీసుకునే పారితోషికాన్ని దాదాపు రెట్టింపు చేశారు. అలా చేసినా కూడా ప్రభాస్ ఆయా సినిమాలకు ఎక్కువ రోజులు కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాలకోసం మరికొన్ని రోజులు అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్ కూడా రెండు మూడు భాషల్లో తమ సినిమాలు విడుదల చేస్తున్నా.. రెమ్యునరేషన్ విషయంలో మరీ బాలీవుడ్ ని రీచ్ కాలేకపోతున్నారు. ఈ దశలో పవన్ కల్యాణ్ రీఎంట్రీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

వకీల్ సాబ్ తర్వాత మూడు సినిమాలు లైన్లో పెట్టిన పవన్ కల్యాణ్ ఇటీవలే నాలుగో సినిమా కబురందించారు. అయ్యప్పన్ కోషియమ్ అనే రీమేక్ సినిమాలో పవన్ నటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పవన్ రోజుకి కనీసం కోటి రూపాయల పారితోషికాన్ని ఈ సినిమాకోసం తీసుకోబోతున్నారట. రీమేక్ మూవీకోసం పవన్ కేవలం 40రోజులు పనిచేస్తారు. దీనికిగాను రెమ్యునరేషన్ గా 30కోట్ల రూపాయలు తీసుకోబోతున్నారట. దీంతోపాటు లాభాల్లో 25శాతం వాటా అదనం. అంటే.. దాదాపుగా రోజుకి కోటి రూపాయల పారితోషికాన్ని అందుకోబోతున్నారు పవన్ కల్యాణ్. టాలీవుడ్ లో మరే ఇతర హీరో కూడా ఆ స్థాయిలో ఇప్పటి వరకూ డిమాండ్ చేయలేదట. ఒకవేళ డిమాండ్ చేసినా కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే రీఎంట్రీతో పవన్ కల్యాణ్ తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారని సంబరపడుతున్నారు ఆయన అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: