రవితేజ విలన్ ఇప్పుడు హీరోగా వస్తున్నాడా..?

Suma Kallamadi
బాబీ సింహా మంచి నటుడు. ఇతను రవితేజ హీరోగా నటించిన ' డిస్కో రాజా ' సినిమా లో విలన్‌ పాత్ర చేసి తన ట్యాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ విలన్ ఇప్పుడు హీరోగా రానున్నాడు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే ... వసంత కోకిల అనే సినిమా కి  బాబీ సింహా హీరోగా నటించనున్నాడు. బాబీ సింహా జాతీయ అవార్డ్ గ్రహీత అన్న సంగతి మనకి తెలిసినదే. ఈ సినిమాకి  రమణన్ పురుషోత్తమ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు. తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

వసంత కోకిల సినిమాని  తెలుగులో ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ , ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై రామ్ తళ్లూరి , రేష్మీ సింహా అందిస్తున్నారు. ఇక హీరోయిన్ విషయం లోకి వస్తే నర్తనశాల ఫేమ్ కశ్మీర పర్‌దేశి బాబీ సరసన నటిస్తోంది. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి టైటిల్  ని బాబీ సింహా పుట్టిన రోజు సందర్భంగా ఎనౌన్స్ చేసారు. అలానే సినిమా  ఫస్ట లుక్ ని కూడా విడుదల చేయడం జరిగింది. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా రెడీ అవుతోంది.  చేతిలో విల్లు-బాణం, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రీన్‌ కలర్ టింట్ తో ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది.

అలానే తమిళ స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాకి సంబంధించిన తమిళ, కన్నడ టైటిల్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోపి అమరనాథ్ సినిమాటోగ్రాఫర్ గ వ్యవహరిస్తున్నారు‌. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: