బిగ్ బాస్ కు మళ్ళీ మొదలైన సమస్యలు !

Seetha Sailaja
చిరంజీవికి కరోనా రావడంతో కేవలం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ మూవీకి మాత్రమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో పాటు బిగ్ బాస్ షోకు కూడ సమస్యలు తప్పవు అన్న విశ్లేషణలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం చిరంజీవి నాగార్జునలు అతి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంలో వారిద్దరూ మాస్కులు కూడ పెట్టుకోలేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

దీనికితోడు ఈమధ్య జరిగిన గ్రీ ఛాలెంజ్ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్న తరువాత ఆకార్యక్రమం పూర్తి  అయిన తరువాత చరణ్ చిరంజీవి లను పార్లమెంట్ మెంబర్ సంతోష్ కుమార్ కలవడంతో పాటు జగతిబాబు కూడ ఈమధ్యనే చిరంజీవిని కలిసాడు అన్న ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో ఫస్ట్ కాంటాక్టుల్లో ఒకరైన నాగార్జున బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాత్తగా వ్యవహరిస్తున్నాడు.

వచ్చే శని-ఆది వారాలలో జరగవలసిన బిగ్ బాస్ షో చిత్రీకరణలో నాగార్జున పాల్గొనవలసి ఉంది. ప్రస్తుతం చిరంజీవికి కరోనా సోకినా నేపధ్యంలో నాగార్జున ఐసోలేషన్ లోకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడటంతో ఈవారం షోకి నాగార్జున రాకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో నాగార్జున స్థానంలో మళ్ళీ సమంత కు బాధ్యతలు అప్పచెప్పే ఆస్కారం ఉంది అని అంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజా పరిణామాలతో రామ్ చరణ్ తో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ ఫిలిం యూనిట్ అంతా ఐసోలేషన్ లోకి వెళ్ళవలసి వస్తుందని దీని ఫలితంగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడుతుందని అంటున్నారు. చిరంజీవి కరోనా సమస్య నుండి త్వరగానే కోలుకున్నా అతడి వైద్యుల సలహాను పాటిస్తూ ‘ఆచార్య’ షూటింగ్ మరో రెండు నెలలు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఈసంఘటనతో ఇప్పుడిప్పుడే తమ భయాలను పక్కన పెట్టి షూటింగ్ లకు వస్తున్న టాప్ హీరోలు మరో రెండు మూడు నెలలు షూటింగ్ లకు దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ చిరంజీవికి వచ్చిన కరోనా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: