ప్రభాస్ - నాగ అశ్విన్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ ....??

GVK Writings
ప్రస్తుతం యువ దర్శకడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్ మూవీ లో నటిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. గత ఏడాది సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దానితో కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రం అందుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లో రాధేశ్యామ్ తో భారీ సక్సెస్ ని అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది.

కాగా దీనిని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే దీని తరువాత ప్రముఖ యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే మరొక సినిమా చేయనున్నారు ప్రభాస్. కాగా నాగ అశ్విన్ దర్శకతంలో తెరకెక్కనున్న సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనుండగా, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించనుండగా, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఒక కీలక పాత్ర చేయనున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి దీనిని సంక్రాంతి పండుగ తరువాత సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో యూనిట్ సిద్ధం చేస్తోందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత వేగవంతంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో దీనిని 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక నేడు ఉదయం దీనితో పాటు ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ని 11.08.2022 గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిని బట్టి వచ్చే ఏడాది రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్, ఆపై ఏడాది మొత్తం రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరించనున్నారు......!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: