అంకుల్స్ తో రొమాన్స్ చేస్తున్న శ్రీముఖి.. ఫ్యాన్స్ హ్యాపీ..?
ఓవైపు బుల్లితెరపై వరుసగా షో ల తో అదరగొడుతున్న ఈ అమ్మడు మరో వైపు ప్రత్యేకమైన ఈవెంట్లు కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అదే సమయంలో వెండి తెరపై కూడా అవకాశాలు అందుకుంటోంది. అయితే శ్రీముఖి త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్టులోకి అడుగుపెట్టబోతోంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్నది శ్రీముఖి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర ఎంతో కీలకమైనదని.. శ్రీముఖి తో పాటు ముగ్గురు అంకుల్స్ గా రాజా రవీంద్ర, మను, భరణి లు నటిస్తున్నారు అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని తాము నమ్ముతున్నాము అంటూ దర్శకుడు ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రస్తుతం ఇప్పటికే శ్రీముఖి ఇట్స్ టైం టు పార్టీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ కూడా విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.