ఊర మాస్ హీరో.. పక్కా క్లాస్ డైరక్టర్.. కాంబో అదుర్స్ బాసు..!

shami
రన్ రాజా రన్ సినిమాతో మొదటి సినిమాతోనే టాలెంట్ చూపించాడు డైరక్టర్ సుజిత్. ఈ సినిమా తర్వాత సుజిత్ ఏకంగా బాహుబలి ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. బాహుబలితో సెన్సేషనల్ రికార్డ్ అందుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా సుజిత్ కి ఇచ్చాడు. సాహో అంటూ వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ డైరెక్షన్ ఛాన్స్ వచ్చినా చేజార్చుకున్నాడు. ఇదిలాఉంటే సుజిత్ తన నెక్స్ట్ సినిమా మాస్ హీరో గోపీచంద్ తో చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సీటీమార్ అంటూ సత్తా చాటనున్నాడు. ఈ సినిమాలో తమన్నా గోపీచంద్ తో రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరక్షన్ లో గోపీచంద్ సినిమా ఉంటుందని టాక్.
ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తారని తెలుస్తుంది. ఇదే కాకుండా గోపీచంద్ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలు మాత్రం ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఈ సినిమాలు పడితే గోపీచంద్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. గోపీచంద్ కూడా ఇక మీదట తన సినిమాల గురించి జాగ్రత్త పడుతున్నాడు. కథల మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: