ఆ విషయంలో క్లారిటీ ఇవ్వండి సర్ ... నిర్మాతలను కోరుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ....??

GVK Writings
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ తో పాటు అతి త్వరలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ హిస్టారికల్ మూవీ ఆదిపురుష్ లో కూడా నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎంతో భారీగా నిర్మించనున్నారు. ఇక వీటిలో రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి కాగా దీని తదుపరి షెడ్యూల్ అతి త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించి వీలైనంత త్వరగా ముగించి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
మరోవైపు నాగ్ అశ్విన్ సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈలోపు మరొక నెల తర్వాత ఆదిపురుష్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని తన పాత్ర కోసం ప్రభాస్ కొంత స్లిమ్ గా తయారై బాగా ఫిట్ గా మారారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన  పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించనున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.
వారిలో ప్రముఖంగా కియారా అద్వానీ, శ్రద్ధ కపూర్, కృతి సనన్, అనుష్క శెట్టి ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు సీత గా నటిస్తారు అనే దానిపై ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాకపోవడంతో ఈ విషయమై ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారో అధికారికంగా తెలియచేయండి సార్ అంటూ పలువురు ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ మూవీ దర్శకనిర్మాతలను ఉద్దేశించి సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆదిపురుష్ టీం ప్రభాస్ ఫ్యాన్స్ అభ్యర్థనను ఎంత వరకు మన్నిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: