నితిన్ కు ధియేటర్ల భయం పట్టుకుందా..?
తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన డిసైడ్ అయ్యారట..అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నితిన్ కి కొంత కంగారు మొదలైందట. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నితిన్ కి టెన్షన్ మొదలైందట.ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ థియేటర్లలో విడుదల అవుతుంది. అయితే నితిన్ ఆ ధైర్యం చేయలేకపోతున్నాడట.
థియేటర్లు తెరిచినా కానీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, అప్పటి మాదిరిగా కలక్షన్లు వస్తాయా అనేది అనుమానంగా వుంది. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా బాగా అవడంతో ఒక నాలుగైదు కోట్లు లాభం వచ్చేలా ఓటిటి డీల్ ఏదైనా వస్తే ఇచ్చేసి ఆలోచనలో ఉన్నాడట. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్స్ గోల వుండదు కాబట్టి నిర్మాతకు ఎలాంటి చీకు చింత వుండదు. అలాగే రంగ్ దేకు కూడా డీల్ సెట్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఈ సినిమా భవిష్యత్ ఏమవుతుందో చూద్దాం..