పూరీ.. మహేష్ కలవడం వెనక ఆ నిర్మాత.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి..!
పూరీ చేసిన కామెంట్స్ ను మహేష్ లైట్ తీసుకున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. పూరీ, మహేష్ ఇద్దరు కలిసి చేసే హ్యాట్రిక్ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత అనీల్ సుంకర. మహేష్, పూరీ కాంబినేషన్ లో సినిమా కోసం అనీల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నాడట.
మహేష్ ఓకే అంటే జనగణమన సినిమా ఫిక్స్ అయినట్టే. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాకు ముందు పూరీ సినిమా ఉంటుందా లేక రాజమౌళి సినిమా తర్వాత పూరీతో సినిమా ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి.