"నన్ను చూసి నేర్చుకోండి'' అంటున్న రష్మీక...ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..??

Anilkumar
కన్నడ బ్యూటీ రష్మీక మందన్న ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ గా మారిపోయింది. టాలీవుడ్లో 'ఛలో' సినిమాతో అరంగేట్రం చేసిన అమ్మడు.. ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఇక విజయ్ దేవరకొండ సరసన .ఈమె నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించడంతో.. రష్మీక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడి రేంజ్ ఎలా ఉందంటే.. రష్మీక ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల పారితోషకాన్ని డిమాండ్ చేస్తోందట.
అంటే రష్మీక ఇప్పుడు ఎలాటి అగ్ర స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదికి మహేష్ తో సరిలేరు నీకెవ్వరు... లవర్ బాయ్ నితిన్ సరసన భీష్మ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే సినిమా షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం విషయంలో మాత్రం రష్మిక రాజీ పడదు. ఇంట్లో ఉన్నా, షూటింగ్‌లకు వెళ్లినా వర్కవుట్లు మాత్రం చేయాల్సిందే. తన వర్కవుట్ వీడియోలను రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటుంది.ఇప్పటికే రష్మీకకు సంబంధించిన జిమ్ వర్కౌట్ వీడియోలు నెట్ లో ఎంతో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మధ్య ఈ అమ్మడు బీచ్ లో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కి నెటిజన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు  తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక..`వర్కవుట్ చేయడానికి మీకందరికీ ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి` అంటూ కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం రష్మీక.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప'సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఈ అమ్మడు చిత్తూరుకు చెందిన ఓ పల్లటూరి అమ్మాయిగా కనిపించనుంది. దీనికోసం చిత్తూరు యాసను నేర్చుకుంటుంది రష్మీక..ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.. ఇక దీంతో పాటు శర్వానంద్ కొత్త సినిమా అయిన 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: