బిగ్ బాస్... విన్నర్ రన్నర్ తేలిపోయిందా ?

Satya
బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో తేలిపోయిందా. ఇంకా పదిహేను రోజుల గేం ఉండగానే ఈసారి విన్నర్ ని ముందే డిసైడ్ చేశారా. అంటే సమాధానం అవును అనే వస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా స్ట్రాంగ్ అనే హోస్ట్ నాగార్జున చెప్పారు. మరి స్ట్రాంగెస్ట్ ఎవరు అన్న దాని మీద బిగ్ బాస్ ఈ వారంలో ఇచ్చిన టికెట్ టూ ఫినాలే టాస్క్ రుజువు చేసింది. మొత్తం ఏడుగురిలో అన్ని రకాలుగా ఇద్దరు స్టాంగ్ అని తేలారు.
వారే సోహెల్ సయ్యద్, అఖిల్ అని అంటున్నారు. ఈ ఇద్దరూ కూడా టికెట్ టూ ఫినాలేలో చివరికి పోటీదారులుగా అయ్యారు. ఈ ఇద్దరూ ఒక రోజంతా గార్డెన్ ఏరియాలో  ఊయాల బల్ల మీద కూర్చుని మొత్తం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నారు. అంతే కాదు కనీసం కిందకు దిగి తమ కాలకృత్యాలను కూడా తీర్చుకోకుండా గడిపారు. ఎండకు, మంచుకు కూడా వెరవకుండా నిలిచారు. ఆకలి నిద్రలను ఓర్చుకున్నారు. మరి బిగ్ బాస్   హౌస్ లో ఇంతకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరైనా ఉంటారా అన్న డౌట్ ఆడియన్స్ కే వచ్చింది.
వారి ఈ చివరి రౌండ్ కి రావడానికి ముందు ఫిజికల్ టాస్కులు కూడా బాగా ఆడారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఇద్దరిలో ఒకరు టికెట్ ఫినాలేలో ఫస్ట్ టికెట్ సాధించుకున్నా రెండవ వారు కచ్చితంగా రన్నర్ గానే ఉంటారు. ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ పరంగా చూస్తే మాత్రం విన్నర్ రన్నరు అన్నది ఫిక్స్ అయిపోయింది. మరి ఆ విధంగా కాకుండా బయట ఆడియన్స్ ఓటింగ్, ఫావరేట్స్, ఫ్యాన్స్ వేసే ఓట్లు కనుక లెక్క చూసుకుంటే ఇప్పటిదాకా అభిజిత్ ఉన్నాడు. అయితే అభిజిత్ ఫిజికల్ టాస్కులలో వెనకబడిపోయాడు. మరి టికెట్ టూ ఫినాలే చూసిన తరువాత ఆడియన్స్ జడ్జిమెంట్ లో మార్పు వస్తే కచ్చితంగా అది అభిజిత్ కి దెబ్బ అవుతుంది. అపుడు సోహెల్ అఖిల్ ఈ ఇద్దరే ముందుంటారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ ఎవరో చూచాయగా తేలిపోతోంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: