రాధే శ్యామ్ క్రిస్మస్ టార్గెట్..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో చేస్తున్న సినిమా రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా క్రిస్మస్ టార్గెట్ పెట్టుకున్నారట. క్రిస్మస్ కల్లా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయ్యారట.

పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన మూడు నాలుగు పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. చూస్తుంటే రాధే శ్యామ్ సూపర్ తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంది.

రాధే శ్యామ్ సినిమా క్రిస్మస్ కు పూర్తైతే 2021 సమ్మర్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా అంచనాలను అందుకోలేదు.

అందుకే రాధే శ్యామ్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రభాస్. సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు.           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: