ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, హాట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రేపు విడుదల కాబోతుంది. లాక్డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న ఫస్ట్ బిగ్ మూవీ ఇదే.. ఇక విడుదల కాబోతున్న పెద్ద మూవీ కావడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’కు ఇండస్ట్రీలోని స్టార్లు అంతా సపోర్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు చిత్ర యూనిట్కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు టిక్కెట్టు ధరలు సవరించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ థియేటర్లు ధరలు పెంచలేదు. బహుశా లాక్డౌన్ తరవాత విడుదలవుతోన్న తొలి సినిమా కావడంతో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని టిక్కెట్ ధరలు పెంచి ఉండకపోవచ్చు. ఏదేమైనా ఆడియన్స్ నుంచి వస్తోన్న ఈ రెస్పాన్స్ మరిన్ని సినిమాల విడుదలకు దారి చూపిస్తోంది.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ విందు భోజనంలా కనిపించింది. అందుకే వదిలి పెట్టకూడదని ముందుగానే క్యూ కట్టేశారు. అడ్వాన్స్గా టిక్కెట్లు బుక్ చేసేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ప్రధాన నగరాల్లోని చాలా థియేటర్లలో ఇప్పటికే తొలి రోజు అన్ని షోలకు టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఆడియన్స్ నుంచి ఈ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
మరింత సమాచారం తెలుసుకోండి: