నాగ చైతన్య సరసన సీరియల్ భామ..వర్కౌట్ అయ్యేనా..?
సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ కాగా టీజర్ ప్రేక్షకులకు నచ్చింది.. ఇందులో అందరి నటనకు ప్రేక్షకులకు ముగ్దులయిపోయారని తెలుస్తుంది. టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచేలా చేశాడు చైతు.. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. నిజానికి గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. నాగచైతన్య ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందినీ రెడ్డితో ఒక మూవీ ఓకే చేసాడట.
అది అలా హోల్డ్ లో పెట్టి మనం లాంటి ఫ్యామిలీ హిట్ అందించిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ సినిమా ఓకే చేసాడు. ఇటీవల విక్రమ్ కె.కుమార్ తో చేయబోయే సినిమాకు 'థాంక్ యూ' అనే సింపుల్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కూడా మనం లాగే వెరైటీ కథ తో రాబోతుందట. ఈ చిత్రాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నాడట.. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం అవికా గోర్ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట.. సీరియల్ నటిగా పేరున్న అవికా కి తెలుగులో మంచి సినిమాలే చేసింది. దాదాపు ఫేడ్ అవుట్ దశలో ఆమెకు ఈ ఆఫర్ రావడం చూస్తుంటే ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిందా చూడాలి.