చైతూ విక్రమ్ సినిమాలో ఆ హీరోయిన్ నటిస్తుందట...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన "లవ్ స్టోరీ" సినిమాతో ముందుకు వచ్చేందుకు సిద్ధంగా వున్నాడు. ఈ సినిమా తరువాత   విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో చైతు హీరోగా ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్న సంగతి  తెలిసిందే. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలొచ్చాయి. తాజాగా రెండో హీరోయిన్‌ ని తీసుకోవడం పూర్తయ్యిందట.

థ్యాంక్యూ’ చిత్రీకరణ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. ఇందులో ముందుగా చెప్పుకున్నట్లు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. తొలి నాయికగా అవికా గోర్‌ను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ను ఎంచుకున్నారట. త్వరలోనే ఆమె సెట్స్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇక మూడో హీరోయిన్‌ విషయంలో చర్చలు ఇంకా జరుగుతున్నాయట. తొలుత ఆ పాత్రకు సమంతను అనుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసులు వినిపించలేదు. దీంతో ఆమె సినిమాలో ఉందా లేదో తెలియడం లేదు.

ఇక ఈ సినిమాలో నాగ  చైతన్య పెద్ద బిజినెస్‌ మ్యాగ్నెట్‌గా కనిపిస్తాడట. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశ్రమలు నెలకొల్పి విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలుస్తాడు. ఈ క్రమంలో తన ఉన్నతికి సాయపడిన అందరికీ థ్యాంక్యూ చెప్పాలని అనుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన అంశాలే సినిమా అని చెబుతున్నారు. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. అన్నట్లు ఇందులో చైతు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌గా కనిపిస్తాడు. అంతేకాదు హాకీ ప్లేయర్‌గా కూడా కనిపిస్తాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: