దిల్ రాజు కాదు కిల్ రాజు.. సంచలన ఆరోపణలు !

Chaganti
టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు మీద క్రాక్ సినిమా నిజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి సంక్రాంతి సీజన్ వచ్చిందంటే దాదాపు అన్ని సినిమాలకు థియేటర్ల సమస్య వస్తూనే ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్నీ థియేటర్లు ముగ్గురు బడా ప్రొడ్యూసర్ల చేతిలోనే ఉంటాయి. నైజాం ప్రాంతం అంతా దిల్ రాజు చేతిలో ఉంటుంది. ఇక కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలను అల్లు అరవింద్ అలాగే సురేష్ బాబు కవర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సారి నైజాం ప్రాంతంలో విజయ్ మాస్టర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా కోసం మిగిలిన వారికి థియేటర్లు అందకుండా చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో నిన్న ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన క్రాక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్ రాజు మీద సంచలన ఆరోపణలు చేశారు. రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఈ జనవరి 9న రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తో రన్ అవుతోంది. అయితే ముందుగా క్రాక్ సినిమా కి ఇచ్చిన థియేటర్లను మాస్టర్ సినిమా కోసం మళ్లీ వెనక్కి తీసుకున్నారని వరంగల్ శీను ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నైజాం థియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ ఇద్దరూ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

మా క్రాక్ ఆడుతున్న మేజర్ సెంటర్స్ లో మా సినిమా తీసేసి మాస్టర్ మూవీ కి ఇచ్చారని ఆయన అన్నారు. క్రాక్ లాంటి హిట్ సినిమా కి కూడా దిల్ రాజు తన నియంతృత్వ ధోరణితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సైతం థియేటర్స్ లేకుండా చేశారని అది ఏంటి అని అడిగిన పాపానికి పదిమందిలో పోరా అంటూ అవమానించారని ఆయన చెప్పుకొచ్చాడు. చేతిలో థియేటర్స్ ఉన్నాయి అన్న కారణంగా నిర్మాతల దగ్గర సినిమాలు తెచ్చుకుని కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ని ఎవరిని ఎదగకుండా తొక్కేస్తున్నాడని ఆయన దిల్ రాజు కాదు కిల్ రాజు అంటూ వరంగల్ శ్రీను తీవ్రంగా ఫైర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: