ఈ వయసులో ఇదేం బుద్ధి.. నటిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: లేటు వయసులోనూ హాటుగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ నటీనటులకు ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు వారి ఆలోనచ బెడిసికొట్టడమే కాకుండా తీవ్ర విమర్శలనూ ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితినే నటి రజినీ చాందీ ఎదుర్కొంటున్నారు. 69 ఏళ్ల లేటు వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టిన రజినీ చాందీ సినిమాల్లో అనేక ఆఫర్లను దక్కించుకున్నారు.
ఒరు ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఫేమ్‌తోనే మళయాల బిగ్‌బాస్‌ సీజన్-2లోనూ పాల్గొన్నారు. అయితే లాక్‌డౌన్ తరువాత క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె ఓ సరికొత్త ఐడియా వేశారు. ఓ ఫోటో షూట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో షూట్ ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.
సాధారణంగా యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ లలో పాల్గొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. కానీ ఏడు పదుల వయస్సులో రజినీ చాందీ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇన్నాళ్లూ సినిమాలతో పాటు బయట కూడా రజినీ చాందీ చక్కటి చీరకట్టులో, సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేవారు. అయితే ఉన్నట్లుండి ఈ ఫోటోషూట్‌ తన వస్త్రధారణనే పూర్తిగా మార్చేశారు. ఫ్లోరల్‌ మాక్సీ, డెనిమ్ లు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.
 రజినీ చాందీ ఫోటోలు చూసిన నెటిజన్ల ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఈ వయస్సులో ఇదేం బుద్ధి.?’ అని కామెంట్లు చేస్తుంటే మరి కొందరేమో ‘మీరు ఇంకా చనిపోలేదా.?’ అంటూ వ్యాంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.  అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తున్నారు.
ట్రోలింగ్ పై కూడా స్పందించి రజినీ చాందీ.. త్వరలో తనకు 70 సంవత్సరాలు నిండుతాయని. ముసలావిడ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యాపకాలు స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. తనకు నచ్చినట్లుగా ఉంటున్నానని, నచ్చిన పని చేస్తున్నానని రజినీ చాందీ వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణ ఇచ్చిన తరువాత ట్రోలింగ్స్ మరింత ఎక్కువ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: