హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?

Shirisha
గ్రీన్  ఇండియా ఛాలెంజ్’ ఉద్యమంలా ముందుకు వెళ్తోంది. అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా మొక్కలునాటటం మొదలు పెట్టారు చాలామంది సెలబ్రిటీస్ . రాజ్య‌స‌భ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్య‌క్ర‌మం మ‌రింత‌ విస్తృతంగా కొనసాగేలా ప్ర‌చారం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ , బిగ్ బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నై సైదాపెట్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు  ప్రముఖ హీరోయిన్ మీనా.ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు.

 ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని కోరారు సినీ నటి మీనా. సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ  కన్నడ హీరో  సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఆమెకు ఎంపీ సంతోష్ కుమార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.ఇక మధ్యలో మంచి కథలు వచ్చినపుడు సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా మోహన్ లాల్ సరసన దృశ్యం 2లో నటించింది మీనా. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
అలాగే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ పాల్గొన్నది. సొహెల్‌ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్‌లోని పార్కులో       మొక్కలు నాటింది. పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అరియానా గ్లోరీ తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: