తన కూతురిని తన ద్వారా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యనని చెప్పిన బోనీ కపూర్..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దివంగత నటి శ్రీదేవి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఇండియా లో మాహానటి సావిత్రి గారి తరువాత ఆ రేంజిలో హీరోలకి సమానంగా ఏమాత్రం తక్కువ కాకుండా క్రేజ్ ఇంకా డిమాండ్ సంపాదించుకుంది శ్రీ దేవి. ఇక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటి అక్కడ కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక హీరోయిన్ గా పీక్స్ స్టేజ్ లో వున్నప్పుడే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.ఇక ఈ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా పరిచయమయ్యి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది..ఇక అలాగే అతిలోక సుందరి అభిమానులు తన  రెండో అమ్మాయి ఖుషీ కపూర్‌ ఎంట్రీ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఖుషీ సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా, ఎక్కడా స్పష్టత లేకుండా ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఖుషీ తండ్రి బోనీ కపూర్‌ కాస్త క్లారిటీ ఇచ్చాడు. దాని ప్రకారం చూస్తే ఆ సినిమాను ఆయన నిర్మించడట. ఎందుకంటే?తల్లి శ్రీదేవికి తగ్గ వారసురాలిగా ఇప్పటికే జాన్వి కపూర్‌ బాలీవుడ్‌లో అదరగొడుతోంది. మరోవైపు ఆమె టాలీవుడ్‌లోకి వస్తుందని వార్తలొచ్చినా, ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా, ఆ సినిమా అంటూ పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఈలోగా అతిలోక సుందరి రెండో కూతురు ఖుషి ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు. చిన్న కూతురు, అందులోనూ ముద్దుల కూతురు కదా… మరోవైపు బోనీ ఈ మధ్య నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయనే ఇంట్రడ్యూస్‌ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ బోనీ అందుకు రెడీగా లేరట.

“ఖుషీ కపూర్‌ని చిత్రసీమకు పరిచయం చేయడానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి. అయితే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసేది నేను కాదు. నిర్మాతగా నాకు, నటిగా ఖుషీకి అదంత మంచిది కాదు. ఎంత ఫ్యామిలీ సపోర్టు ఉన్నా, ఇతర నాయికల్లాగే మా అమ్మాయీ సొంతంగా రాణించాలి. అందుకే నేను ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేయాలని అనుకోవడం లేదు” అంటూ ఇటీవల బోనీ కపూర్‌ చెప్పుకొచ్చారు. ఖుషీ లండన్‌ ఫిలిం స్కూల్లో ఇటీవల శిక్షణ తీసుకుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: