అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న రామ్...
"ఇస్మార్ట్ శంకర్ " సినిమా ఊపుతో "రెడ్" సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ప్యాన్ ఇండియా మార్కెట్ ని గ్రాబ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు.సంక్రాంతికి రెడ్ తో హిట్ కొట్టి ఈ సంవత్సరం సక్సెస్ తోస్టార్ట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ ఇప్పుడు మలయాళంలోనూ తొలి బోణీ కొట్టాలని చూస్తున్నాడు. రెడ్ సినిమాని కేరళలో అత్యధికంగా 104 ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే, రామ్ నటించిన పలు సినిమాలు మలయాళంలో డబ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి.అందుకే, ఈసారి భారీస్థాయిలో దిగుతున్నాడు. ఎక్కువ స్క్రీన్స్ పై రెడ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా వసూళ్లు రాబడితే భవిష్యత్తులో ఇక తన సినిమాలన్నింటిని మలయాళంలోనూ ఓకే రోజు విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఇప్పుడు టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా హవా కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడీ కుర్రహీరో కూడా బన్నీని ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. మరోవైపు రెడ్ హిట్ తర్వాత రామ్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...