'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!
మెంటల్ మదిలో సినిమాతో అతనికి డైరక్షన్ ఛాన్స్ ఇచ్చిన రాజ్ కందుకూరి సెకండ్ సినిమా బ్రోచేవారెవరురా సినిమా తర్వాత థర్డ్ సినిమా తనతో చేస్తానని చెప్పాడని.. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నాడని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారట. అయితే ఆ సినిమా స్టార్ట్ చేసే ముందు మైత్రి మేకర్స్, వివేక్ ఆత్రేయ ఇద్దరు తనని అడగలేదని చెబుతున్నారు రాజ్ కందుకూరి. మరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు ఉగాది కానుకగా ఈ సినిమా రిలీజ్ అవనుంది.
ఈ సినిమాతో పాటుగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత నాని అంటే సుందారానికి సెట్స్ మీదకు వెళ్తుంది. మరి ఈ గ్యాప్ లో రాజ్ కందుకూరికి ఇచ్చిన మాట ప్రకారంగా డైరక్టర్ వివేక్ ఆత్రేయ అతనితో సినిమా చేస్తారో లేదో చూడాలి. మొదట ఛాన్స్ ఇచ్చిన నిర్మాత అనే సెంటిమెంట్ తో నాని సినిమా కన్నా ముందు వివేక్ రాజ్ తోనే సినిమా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పొచ్చు.