హీరో అల్లరి నరేష్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీ ఎంటర్టైన్ మూవీస్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే అతికొద్ది మంది అగ్ర దర్శకులలో ఇ. వి. వి. సత్యనారాయణ గారు ఒకరు...కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు.. ఇక ఆయన వారసుడిగా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్..  చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని 'అల్లరి నరేష్' గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ కూడా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి..పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు..ఇక అల్లరి నరేష్ చదువు దాదాపుగా అంతా చెన్నైలోనే సాగింది. 'అల్లరి' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఆ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు..
ఇక అల్లరి నరేష్ వ్యక్తిగత విషయానికొస్తే.. విరూప కంఠమనేని అనే అమ్మాయిని మే 29, 2015 న వివాహం చేసుకున్నాడు ఈ హీరో.అయితే ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా అసలు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట.ఆమెఓ ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు తన భర్త నరేష్ నటించిన సినిమాల్లో 'జేమ్స్ బాండ్' సినిమా మాత్రమే చూసిందట విరూప..ఎందుకంటే ఆమె ఆర్కిటెక్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదట.ఇక విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి.వీళ్లిద్దరి వివాహం పెద్దలు కుదిర్చింది..
ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ భార్య తన ఆర్కిటెక్ బిజినెస్ కు సంబంధించిన పనులను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు అల్లరి నరేష్ హీరోగా మళ్ళీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నా.. అది అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించడంలేదనే చెప్పాలి.. ఎందుకంటే తాజాగా అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది..అందుకే ఈసారి ఓ డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిన 'నాంది' అనే సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ అల్లరోడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: