ఇలా అయితే పూజ పరిస్థితి కూడా ఇలియానా లో అవుతుందట....
పూజా హెగ్డే హవా ప్రస్తుతం టాలీవుడ్లో మాములుగా నడుస్తలేదు.ఇక ఈమను మించిన అందగత్తె దొరకదని డబ్బులు విపరీతంగా పొసేస్తున్నారు మన టాలీవుడ్ నిర్మాతలు. అందుకే అది క్యాష్ చేసుకోని ఈ హాట్ బ్యూటీ వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ వెళ్లిపోతోంది. అలా ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటించబోతోంది. ఈ పాత్ర కోసం చాలామందిని అనుకున్నా.. ఆఖరుకు పూజను ఓకే చేసింది చిత్రబృందం. అయితే దీని కోసం ఆమె కోటి రూపాయలు వసూలు చేస్తోందట. సినిమాలో ఆమె పాత్ర నిడివి 20 నిమిషాలే ఉండబోతోంది.
అంటే ఒక్కో నిమిషానికి ఆమెకు ఐదు లక్షల రూపాయలు చెల్లించి మరి తీసుకుంటున్నారట.‘స్టార్ హీరోయిన్ గా జోరు చూపిస్తున్న సమయంలో ఇలా తక్కువ నిడివి ఉన్న పాత్రలు ఎంచుకోవడం ఏంటో’ అని అందరూ అనుకుంటున్న సమయంలో కోటి రూపాయల మాట విని.. అదన్నమాట సంగతి అనుకుంటున్నారు. ఇంత దారుణంగా వసూలు చేస్తే ఈమె పరిస్థితి భవిష్యత్తులో ఇలియానా లా అవ్వడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.