శ్రీదేవి మీద కోపంతోనే రాజమౌళి ఇదంతా చేస్తున్నాడా..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ వింత వార్త వైరల్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి శ్రీదేవి మీద కోపంతోనే బోనీ కపూర్  ను ఇబ్బంది పెడుతున్నాడట.. వినడానికి ఇది సిల్లీగా ఉన్న కారణం మాత్రం బలమైంది అంటున్నారు ఈ వార్తను ప్రచారం చేసేవారు.. బాహుబలి రిలీజ్ సమయంలో రాజమౌళి శ్రీదేవి ని కించపరిచే విధంగా మాట్లాడడం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి శ్రీదేవి అభిమానులు పెద్ద ఎత్తున రాజమౌళి న విమర్శనచగా దానికి రాజమౌళి వివరణ ఇచ్చాడు కూడా.. ఆ విషయం పాతది.. శ్రీదేవి మరణం తర్వాత అది అందరు మర్చిపోయారు కూడా..

కానీ ఇప్పుడు రాజమౌళి rrr రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే మళ్ళీ శ్రీదేవి గుర్తొచ్చింది కొంతమంది విమర్శకులకు.. రాజమౌళి ఏది అన్నా సరే శ్రీదేవి కి లింక్ పెట్టి విమర్శిస్తున్నారు. ఇప్పుడు బోనీ కపూర్ కి లింక్ పెట్టి మళ్ళీ రాజమౌళి ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న rrr సినిమా ని అక్టోబ‌ర్ 13న దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎంటైర్ సినీ ప‌రిశ్ర‌మ అంత సంతోష‌ప‌డితే.. బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ మాత్రం త‌న బాధ‌ను వ్య‌క్తం చేశాడు. ఈ సంగ‌తి కూడా అంద‌రికీ తెలిసిందే. త‌న మైదాన్ సినిమాను ఆరు నెల‌ల ముందుగానే విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తే.. ఇప్పుడు రాజ‌మౌళి మ‌ధ్య‌లో వ‌చ్చాడంటూ ఆయ‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశాడు. అయితే దీనిని వేరేలా అర్థం చేసుకున్న విమర్శకులు  రాజ‌మౌళి గత జ్ఞాపకాన్ని మ‌న‌సులో పెట్టుకుని బోనీక‌పూర్ మైదాన్ సినిమా స‌మ‌యంలో త‌న ఆర్ఆర్ఆర్ సినిమాను విడుద‌ల చేస్తున్నాడ‌ని అంటున్నారు. మ‌రి వార్త‌ల‌పై రాజ‌మౌళి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఏదేమైనా ఇలాంటి సిల్లీ సిల్లీ ఆరోపణలు చేసే టైం ఇటు బోనీ కపూర్ కి గానీ, అటు రాజమౌళి కి గానీ లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: