ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
యాంకరింగ్ రంగంలో భారీ సంపాదన ఉన్నప్పటికీ వారిలో కొంత మంది ఏదో ఒక షో ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మరి కొంతమంది ఏమో అసలు కనపడకుండా పోయారు. అలాగే ఒకప్పుడు అద్భుతమైన యాంకరింగ్ లతో మనల్ని మెప్పించి, ప్రస్తుతం మనకు కనబడకుండా పోయిన యాంకర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రగతి:
ప్రగతి ఈటీవీ లో చాలా ఫేమస్. ఈటీవీ లో రాత్రి 9 గంటలకు వచ్చే న్యూస్ చదవడానికి ప్రగతి యాంకరింగ్ చేసేది. న్యూస్ రీడర్ అయినా కానీ ఈవిడ కు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. మరిముఖ్యంగా ఈమె కోసమే రాత్రి 9 గంటలు అయితే చాలు.. చాలా మంది ఈటీవీ వార్తలు పెట్టేస్తారు. మరి కొంతమంది ఆడవాళ్లు అయితే ప్రగతి ఈరోజు ఏం చీర కట్టుకుందో అని ఆలోచిస్తూ ఆమెకోసం వార్తలు పెడతారు. అలా తన అందంతో, యాంకరింగ్ తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేది ప్రగతి.
మైథిలి :
ఈటీవీ లో ప్రగతి న్యూస్ కి ఎంత ఫేమస్ అయిందో ఇక మైతిలి కూడా జెమినీ టీవీలో న్యూస్ కి అంతే ఫేమస్. ఈవిడ పేరు మనకి పెద్దగా తెలియకపోయినా ఆమె ముఖం చూసిన,వాయిస్ విన్నా ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతేకాకుండా మైతిలి కొన్ని ప్రోగ్రామ్స్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా ఇచ్చింది. ఇక కొన్ని కారణాల చేత మైథిలీ యాంకరింగ్ కు దూరంగా ఉంటోంది.
లిఖిత కామిని:
లిఖిత కామిని తెలుగు అమ్మాయి. ఈమె చక్రవాకం సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ లో కూడా నటించింది. ఈ రెండు సీరియల్స్ లిఖిత కు మంచి పేరు తెచ్చిపెట్టాయి అని చెప్పవచ్చు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినీ రంగానికి దూరంగా ఉంటూ వస్తోంది లిఖిత
కీర్తి :
కీర్తి జెమినీ టీవీలో ప్రసారమయ్యే యువర్స్ లివింగ్,తో పాటు నీకోసం ప్రోగ్రాం ద్వారా బాగా ఫేమస్ అయింది. ఆ తరువాత జెమినీ టీవీ, తేజ టీవీ లో కొన్ని ప్రోగ్రాం కి హోస్ట్ గా చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత చాలా రోజులకు టీవీ ఫైవ్ లో కూడా ఒక ప్రోగ్రాం చేసి మళ్ళీ కనపడకుండా పోయింది.