ఏంటి.. ఉప్పెన కథ విజయ్ దేవరకొండ కోసం రాశాడా..?

shami
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తూ నటించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ లో బుచ్చి బాబు నిర్మించారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. యువత మెచ్చే ప్రేమకథతో పాటు ఇదివరకు ఎప్పుడూ తెర మీద చూపించని ఓ కథని తీశారు. డైరక్టర్ బుచ్చి బాబు ఎంచుకున్న కథ తీసిన కథనం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. సినిమా మొత్తం ఉప్పాడ సముద్ర తీరంలోనే తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ కు ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. అయితే సినిమా కథ అనుకున్నప్పుడు బుచ్చి బాబు విజయ్ దేవరకొండ అనుకుని లైన్ రాసుకున్నాడట. అయితే ఈ కథ పూర్తి చేసే సరికి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిట్ అవడం ఆ తర్వాత గీతా గోవిందం కూడా బ్లాక్ బస్టర్ అయ్యే సరికి బుచ్చి బాబు తన ఆలోచనని మార్చుకున్నాడట. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తే మాత్రం కచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యేది.

ఈ కథ కొత్త హీరోకే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు వైష్ణవ్ తేజ్ ను ఒప్పించడానికి కూడా చాలా కష్టపడ్డారట దర్శక నిర్మాతలు. మెగా ఫ్యామిలీ హీరో ఇలా విలన్ చేత శిక్షించబడటం లాంటి యాస్పెక్ట్స్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టొచ్చని భావించారు. కాని మెగా ఫ్యాన్స్ ప్రయోగాలను సపోర్ట్ చేస్తారని ఉప్పెన రిజల్ట్ తో తెలుస్తుంది. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కే పర్ఫెక్ట్ మిగతా ఎవరైనా సరే ఇంత బజ్ వచ్చేది కాదని అంటున్నారు.                               

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: