ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!
కేరళలోని వాయనాడ్లో కొందరు వ్యక్తులు జీప్తో ఓ ఎలుగుబంటిని వెంబడిస్తూ, దాని పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నటి రవీనా టాండన్ కంటపడడంతో ఆమె ఈ వీడియో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు.
"ఆటవిక నిరక్ష్యరాస్యులు. కనీసం కారును కొంచెంసేపు ఆపి ఎలుగును దాని దారిలో దానిని వెళ్ళనీవ్వచ్చు కదా"మీరు ఆ ప్రదేశంలో ఉన్నారు. దానిపై కొంచమైనా జాలి చూపించాలి కదా అంటూ... రవీనాటాండన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ విధంగా జంతువుల పట్ల అవగాహన కల్పిస్తూ సామాన్య ప్రజల నుంచి పలువురు సెలబ్రిటీల వరకు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నప్పటికీకొంతమంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు . నోరులేని మూగజీవాల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించడం వల్ల మూగజీవాలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎలుకుబంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే రవీనా టాండన్ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈమె ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజిఎఫ్2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈమె పాత్రకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.