ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన సుజీత్..ఏకంగా బాలీవుడ్లో !

Chaganti
కేవలం ఒకే సినిమా చేసి రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం కొట్టేశాడు కుర్ర దర్శకుడు సుజిత్. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయకుండా కేవలం షార్ట్ ఫిలిం తీసిన అనుభవంతోనే మొదటి సినిమా అవకాశం దక్కించుకున్నాడు. మొదటి సినిమా శర్వానంద్ తో రన్ రాజా రన్ అనే సినిమా తీసి ప్రభాస్ దృష్టిలో పడ్డాడు. కేవలం ఆ సినిమా అనుభవంతోనే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఒక రకమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేశాయి. అయితే ఒక రకంగా ఈ సినిమా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది అనే చెప్పాలి..ఆ తరువాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చాడు సుజీత్. 
అయితే చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ చేసే బాధ్యతను ఈ దర్శకుడికి అప్పగించడంతో ఈ దర్శకుడి లైఫ్ మళ్లీ లైన్ లో పడిందని భావించారు అందరూ.. కానీ ఏమైందో ఏమో ఈయన ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈయన కరోనా టైంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇప్పట్లో సినిమా అవకాశాలు దక్కవేమోనని అందరూ భావిస్తున్న తరుణంలో ఏకంగా ఒక బాలీవుడ్ సైన్ సినిమా సైన్ చేసి అందరికీ షాకిచ్చాడు సుజీత్. జి స్టూడియోస్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థతో తాను పని చేయబోతున్నా అని ఈ దర్శకుడు ప్రకటించాడు.
అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు అయితే ఇంకా ఏమి ప్రకటించలేదు. ఇక సుజీత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నామని జి స్టూడియోస్ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ఒక సంయుక్త ప్రెస్మీట్లో సుజిత్, జీ సంస్థ సీఈవో షరీఫ్ పటేల్ మాట్లాడుతూ తమ కలయికలో ఒక సినిమా తెరకెక్కబోతుంది ప్రకటించారు. సాహో ఒక పూర్తి స్థాయి యాక్షన్ మూవీ అయితే ఇప్పుడు తీస్తున్న సినిమా మాత్రం ఎమోషన్స్ మిక్స్ అయిన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకొచ్చాడు. చాలా గ్యాప్ వచ్చిన కారణంగా సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతాను అని ఎదురుచూస్తున్నట్లు సుజిత్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: