ఎన్టీయార్ త్రివిక్రమ్ కాంబో...రేసులో ఇద్దరు బ్యూటీస్ ?

Satya
జూనియర్ ఎన్టీయార్ ఇపుడు ట్రిపుల్ ఆర్ మూవీ సెట్స్ మీద బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే తరువాత చేయబోయే సినిమా మీద దృష్టి పెట్టాడు. ఆ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  డైరెక్ట్ చేస్తున్న సంగతి విధితమే. ఈ ఇద్దరి  కాంబోలో ఫస్ట్ టైం అరవింద సమేత మూవీ వచ్చి భారీ హిట్ కొట్టింది.
ఇపుడు దానికి మించిన హిట్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ అద్భుతమైన కధతో రెడీగా ఉన్నాడు. ఈ మూవీ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వచ్చే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంత్రికి రిలీజ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ మూవీ విషయంలో కధ కుదిరింది, టాప్ టెక్నీషియన్లను సెట్ చేశారు కానీ హీరోయిన్ ఎవరు అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
ఈ మూవీ విషయంలో చాలా మంది పేర్లు ఇప్పటిదాకా వినిపించాయి. ఒక దశలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవిని కూడా అనుకున్నారని టాక్.  అయితే ఎందుకో ఇపుడు ఇద్దరు అందాల భామలను ఫైనల్ లిస్ట్ లో పెట్టారుట. వారు ఎవరో కాదు, కియారా అద్వానీ, పూజా హెగ్డే, ఈ ఇద్దరు ముద్దు గుమ్మలతో ఒకరిని ఖరార్ చేస్తారు అంటున్నారు. అయితే డేట్స్ బల్క్ గా ఇవ్వాలన్నది త్రివిక్రమ్ షరతు, దాంతో కియారా బిజీగా ఉంది కాబట్టి అన్ని డేట్స్ ఇస్తుందా అన్న డౌట్ అయితే ఉందిట.
ఒకవేళ  ఆమె కాకపోతే మాత్రం పూజా హెగ్డేతో కధ నడిపిస్తారు అంటున్నారు. అన్నట్లు రష్మిక మందనను కూడా మరో వైపు సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని మరో కధనం కూడా ఉంది. మొత్తానికి జూనియర్ త్రివిక్రమ్  కలసి చేసే సినిమాలో ఎవరు హీరోయిన్ అన్నది కొద్ది రోజులలో తెలుస్తుంది అంటున్నారు. చూడాలి మరి జూనియర్ పక్కన నటించే ఆ చక్కని చుక్క ఎవరో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: