నటి మీద హత్యాయత్నం... టాలీవుడ్లో కలకలం !
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్పై తన కారును గుద్దిన దుండగులు హత్యాయత్నాని కి ఒడిగట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు మీదనే తనకు అనుమానం ఉందని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు సహజీవనం చేసి శ్యామ్ కె.నాయుడు మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమం లో కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసినా పోలీసు అధికారుల మీద కూడా ఆమె ఫిర్యాదు చేయడం, అనంతరం వారి మీద బదిలీ వేటు పడడం కూడా సంచలనంగా మారింది. అయితే తనను అడ్డు తొలగించాలని భావించి హత్యచేసే నేపథ్యంలోనే యాక్సిడెంట్ చేయించి ఉంటాడంటూ శ్యామ్ కె. నాయుడి మీద ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వీరి మధ్య నెల కొన్న వివాదాల ను పరిష్కరించడాని కి సినీ పెద్దలు కొందరు ప్రయత్నించినా ఆమె తనకు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ అంశం మాత్రం అటు టాలీవుడ్ లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది అని చెప్పక తప్పదు. చూడాలి మరి ఏమవుతుందో ?