రామ్ చరణ్ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు...?

Satya
మెగా పవర్ స్టార్ రామ్  చరణ్ ప్రస్తుతం ఆచార్య మూవీ సెట్స్ మీద ఉన్నారు. ఈ మూవీని శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ మూవీ తరువాత రామ్  చరణ్ కొత్త మూవీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఆర్.ఆర్.ఆర్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యేలా ఉంది. దాంతో మొత్తానికి ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చే ఏడాదికి మరో పాన్ ఇండియా మూవీ కోసం రామ్ చరణ్ పక్కా ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే రామ్  చరణ్ కొత్త సినిమా సౌతిండియా ఫేం శంకర్ డైరెక్షన్ లో నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజ్ తన సొంత బ్యానర్ మీద నిర్మించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న  ఒక్కో అప్ డేట్ ఇపుడు ఫ్యాన్స్ కి చాలా హుషార్ తెస్తోంది. ఇదిలా ఉండగా ఈ మూవీ కి ఇప్పటికే అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇపుడు ఆయనతో పాటుగా మరో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ కూడా ట్యూన్లు అందిస్తాడు అన్న వార్త ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తోంది.
అంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ మూవీకి తమ టాలెంట్ ఉపయోగిస్తారు అన్న మాట. ఈ మూవీ విషయంలో ఇప్పటికే భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని న్యూస్ వస్తోంది. దానికి తగినట్లుగా టాప్ టెక్నీషియన్లనే వివిధ విభాగాల్లో తీసుకోవాలని అనుకుంటున్నారుట. ఇక రష్మిక మందనను హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ లో చరణ్, శంకర్ మ్యాజిక్ చేయడానికి అన్ని రకాలుగా ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ మాత్రం 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. అంటే చెర్రీకి భారీ హిట్ రెడీగా ఉందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: