అటు హీరోయిన్స్ గా నటిస్తునే విలనిజం చేసిన తారలు వీళ్ళే.. !!
ఇకపోతే హీరోయిన్ సౌందర్య.. ఏంటి ఈమె గురించి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ హీరోగా నటించిన "మనసిస్తా రా" సినిమాలో సౌందర్య విలన్ పాత్రలో నటించింది.అలాగే త్రిష కూడా తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విపాత్రలో నటించిన ధర్మ యోగి సినిమాలో విలన్ పాత్రలలో నటించింది.అలాగే క్యూట్ లుక్స్ తో యూత్ ని ఆకట్టుకునే సమంత హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోవైపు తమిళ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించే మెప్పించింది.
గ్లామర్ హీరోయిన్ రీమాసేన్ కార్తీ హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో, శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.రాశి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపీచంద్ సరసన విలన్ పాత్రలో అద్భుత నటన చేసింది.ఈ లిస్ట్ లో చివరిగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అంతే రామకృష్ణ తెనాలి, రవితేజ క్రాక్,నాంది సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫిమేల్ విలన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.