చావు కబురు చల్లగా ట్రైలర్ రివ్యూ...కార్తికేయ ఈసారి పక్కా హిట్ కొట్టడం ఖాయంలా కనిపిస్తుంది...

Purushottham Vinay
'ఆర్.ఎక్స్.100' సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో కార్తికేయ.వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో తన నటవిశ్వరూపం చూపించాడు. ఇక ఆ సినిమా తరువాత వరుసగా ప్లాపులు ఎదుర్కున్నాడు. ఇప్పుడు లావణ్య త్రిపాఠితో జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా' చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రంలో హీరో కార్తికేయ బస్తి బాలరాజు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అలాగే బస్తీ బాల రాజుగా ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా కనిపిచంనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ గ్లిమ్ప్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. జేక్స్‌ బిజాయ్ సంగీతంలో రూపొందిన మైనేమ్ ఈజ్ రాజు, కదిలే కాలాన్ని.. వంటి పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి.


అంతేకాదు ఈ చిత్రంలో అనసూయ కూడా ఐటెం సాంగ్ చేయడం.. దాని ప్రోమోకి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మార్చి 19న విడుదల కాబోతున్న 'చావు కబురు చల్లగా' పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మార్చి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతుండగా దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడు.ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్‌లు, పాటలు, టీజర్ అన్నీ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని అధికం చేశాయి.ఇక ట్రైలర్ విషయానికి వస్తే.ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేసారు..ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా కార్తికేయకు మంచి హిట్ ఇవ్వడం ఖాయంలా కనిపిస్తుంది..ఇక మరి చూడాలి ఈ సినిమాతో హీరో  ఆర్  ఎక్స్  100 లాంటి హిట్  అందుకుంటాడో...లేదో ...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: