శర్వానంద్ నటిస్తున్న తాజా సినిమా శ్రీకారం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న ఖమ్మంలో ఎంతో వైభవోపేతంగా జరిగింది. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన ఈ ఆడియో వేడుకకి వేలాది మంది ప్రేక్షకులు విచ్చేసి దీనిని మరింత విజయవంతం చేశారు. రైతులు తమ జీవితం లో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే విధంగా మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు కిషోర్ ఎంతో గొప్పగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై మంచి రెస్పాన్స్ దక్కించుకుని ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శర్వానంద్ మాట్లాడుతూ మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో ఒక చిన్న రోల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం ఉన్న నేను భవిష్యత్తులో ముందుకు ఎదగాలనే నమ్మకం కలిగిందని, అలానే ఆ సమయంలో ఆయన నాకు ఒక మాట చెప్పారు, నీ సంకల్పం గొప్పది అయితే దేవుడే నీ తలరాతను మారుస్తాడు అంటూ మెగాస్టార్ పలికిన మాటలే తనకు స్ఫూర్తి అని, ఆ విధంగా ఎంతో జాగ్రత్తగా ఒక్కో సినిమా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నానని అన్నారు శర్వా.
ఇక రామ్ చరణ్ గురించి శర్వానంద్ మాట్లాడుతూ చరణ్ తో తనకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని ఈ మూవీ ట్రైలర్ చూసిన అనంతరం చరణ్ మాట్లాడుతూ తన వంతుగా ఏదైనా సహాయం చేయడానికి తాను సిద్ధమేనని తప్పకుండా నాన్నగారు ఈ మూవీ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వస్తారని చెప్పటం నిజంగా ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అన్నారు శర్వానంద్. అంతేకాదు మెగాస్టార్ కి నిజమైన వారసుడు చార మాత్రమే అని, ఆయనలా ఎంతో మంచిగా ఆలోచించే వ్యక్తిత్వం గల చరణ్ రాబోయేరోజుల్లో మరిన్ని ఉన్నత స్థానాలు అందుకుంటారని శర్వా అభిలషించారు. ఆడియన్స్ ని అలరిస్తూ ఎంతో వేడుకగా సాగిన ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చిందని తప్పకుండా మూవీ భారీ సక్సెస్ అందుకునే అవకాశం కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు.....!!