టాలీవుడ్
లో వెంకటేష్ నటించిన దృశ్యం
ఎంతటి సూపర్ హిట్ అయిందో
అందరికి తెలిసిందే.
అతి
చిన్న బడ్జెట్ తో మూవీతో
తెరకెక్కిన దృశ్యం,
బాక్సాపీస్
వద్ద డబుల్ ప్రాఫిట్ ని
నిర్మాతకి తెచ్చిపెట్టింది.
ఇదిలా
ఉంటే మళయాళ,తెలుగు,కన్నడ
భాషల్లో విజయవంతమైన దృశ్యం
చిత్రాన్ని కమల్ హాసన్ తమిళంలో
తెరకెక్కిస్తున్న సంగతి
తెలిసిందే. ఈ
చిత్రానికి 'పాపనాశం'
అనే
టైటిల్ పెట్టారు.
మలయాళ
చిత్రానికి దర్శకత్వం వహించిన
జీతు జోసఫ్ తమిళ చిత్రానికి
కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
దీనికి
సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్
ని కలమ్ హాసన్ విడుదల చేసారు.
యూ
ట్యూబ్ లో నూ ఈ ట్రైలర్ హల్
చల్ చేస్తుంది.
ఇప్పటి
వరకూఈ ట్రైలర్ ని దాదాపు 3
లక్షల
మంది చూశారు.
ఇప్పుడీ
ట్రైలర్ ...అభిమానులను
అలరిస్తోంది.
ఇక
కథ విషయానికి వస్తే,
ఎప్పటికప్పుడు
ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు,
మనసెరిగి
నడుచుకునే భార్యతో అతగాడి
జీవితం సాఫీగా సాగుతుంటుంది.
కానీ,
పెద్ద
కూతురి జీవితంలో రేగిన కలకలంతో
ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే
కథాంశంతో రూపొందిన మలయాళ
చిత్రం 'దృశ్యం'.
ఏ
భాషకైనా నచ్చే కథతో రూపొందిన
ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్,
మీనా
జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం
సాధించిన విషయం తెలిసిందే.
దృశ్యం
చిత్రంలో కరప్టెడ్ పోలీస్
కానిస్టేబుల్ పాత్ర కీలకమైంది.
ఆ
పాత్రను ఎవరూ మర్చిపోలేరు.
ఆ
పాత్రను ఇప్పుడు తమిళంలో
కళాభవన్ మణి పోషించనున్నారు.
కమల్
హాసన్ హీరోగా చేస్తున్న దృశ్యం
రీమేక్ లో ఈ పాత్రకు గానూ
మణిని అడిగినట్లు ఆయన సంతోషంగా
డేట్స్ కేటాయించినట్లు
తెలుస్తోంది.
కళాభవన్
మణి లాంగ్ గ్యాప్ తర్వాత
తమిళంలో చేస్తూండటంతో తనకు
ఇది రీఎంట్రీ చిత్రంగా
భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం
39 రోజుల్లో
చిత్రీకరణను పూర్తి చేశారు.
మలయాళ
మాతృకను తెరకెక్కించిన జీతు
జోసెఫ్ తమిళంలోనూ దర్శకత్వం
వహిస్తున్నారు.
కేరళలోని
తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను
చిత్రీకరించారు.
గౌతమి
కమల్హాసన్ భార్యగా నటిస్తున్న
చిత్రమిది. దాదాపు
15 ఏళ్ల
విరామం తర్వాత గౌతమినటిస్తున్న
చిత్రమిదే కావడం గమనార్హం.
మలయాళ
మాతృక దర్శకుడు జీతూ జోసఫ్
దర్శకత్వం వహిస్తున్న ఈ
చిత్రాన్ని జనవరిలో విడుదల
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో
ప్రక్క ఇప్పటికే 'దృశ్యం'
నిర్మాతలకు
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్
లీగల్ నోటీసులు పంపిన సంగతి
తెలిసిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: