కియారా పై కోపంగా వున్న ఎన్టీఆర్ అభిమానులు... అందుకేనా..??

Purushottham Vinay
హాట్ బ్యూటీ కియారా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుల మతులు పోగొడుతూ యూత్ కి ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. ఇక కియారా 2014 సంవత్సరంలో ఫగ్లీ అనే హిందీ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ సినిమా తరువాత ఎం ఎస్ ధోని, మెషీన్ సినిమాల్లో నటించిన కియారా 2017 సంవత్సరంలో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది ఈ హాట్ బ్యూటీ. అందం, అభినయం పుష్కలంగా ఉన్న కియారా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. లస్ట్ స్టోరీస్ సినిమాతో కియారా బోల్డ్ రోల్స్ లో కూడా నటించగలనని ప్రూవ్ చేసుకుంది ఈ హాట్ బ్యూటీ..



భరత్ అనే నేను సినిమా తరువాత వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన ఈ హాట్ బ్యూటీ ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ సినిమాలో కియారా పాత్రకు మంచి పేరే వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమా తరువాత కియారాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కియారాను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కియరా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే కియారా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే కియారా ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే కియారా ఎన్టీఆర్ కు నో చెప్పి రామ్ చరణ్ కు ఓకే చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కియారా పై కోపంగా ఉన్నారట. యంగ్ టైగర్ స్టార్ హీరో కాబట్టి పైగా తెలుగులో టాప్ హీరో కాబట్టి కియారా నో చెప్పినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై కోపంగా వున్నారని సమాచారం అందుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: