టాలీవుడ్ సీనియర్ హీరో మంచు విష్ణు చాలా ఏళ్లుగా వరుస ప్లాపులు ఎదుకుంటూ ఒక్క హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.అందరి స్టార్ హీరోల లాగే తన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కోసం "మోసగాళ్లు" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించింది. జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' బ్యానర్ పై హీరో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. 'ఖైదీ' ఫేమ్ సామ్.సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం మినహా సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవు అంటూ కొంతమంది అంటుంటే విష్ణు, కాజల్ ల నటన మరియు సినిమాటోగ్రఫీ బాగుంది అని మరికొంత మంది ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.అయితే కలెక్షన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు.ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సరిగ్గా వసూళ్లు రాబట్టలేక బాక్స్ ఆఫీస్ వద్ద పేలవ ప్రదర్శన చూపిస్తుంది.
ఇక ఈ చిత్రం ఇప్పటిదాకా ఎంత రాబట్టిందంటే...'మోసగాళ్ళు' చిత్రాన్ని విష్ణు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 20కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.61కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 19.39కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే ఫుల్ రన్లో అయినా ఈ చిత్రం కోటి కలెక్ట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చూడాలి మరి ఈ చిత్రం పుంజుకుంటుందో లేదో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...