పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా...?

VAMSI
తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త రకం డైరెక్షన్ కి నాంది పలికిన వ్యక్తి మన పూరి జగన్నాధ్. హీరోని కాకుండా తన కథను నమ్మి సినిమా తీయడంలో దిట్ట అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత తరువాత ఏమైందో తెలియదు కానీ వరుసగా చిత్రాలు పరాజయం బాట పట్టాయి. దీనితో కొంచెం స్పీడు తగ్గించినా, రీసెంటుగా రామ్ తో తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఇండస్ట్రీ హిట్ అందించడంతో, ప్రస్తుతం సినిమాల విషయంలో మరింత స్పీడ్ పెంచారు పూరి. అంతే కాకుండా ఈయన అతి తక్కువ కాలంలోనే సినిమాలను తెరకెక్కించడంలో మాస్టర్ అని చెప్పాలి.  ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా మరియు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  హీరోయిన్ గా ఒక సినిమా షూటింగును జరుపుకుంటూ ఉంది.

ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తుండడం విశేషం. ఈ సినిమా తండ్రి కొడుకుల చుట్టూ జరిగే కథని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలిసింది.  కన్నడలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ధృవ్ సార్జాను హీరోగా ఈ సినిమా తీయనున్నాడట. కాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని కూడా పూరి జగన్నాధ్ ధృవ్ సార్జాకు వినిపించడం జరిగిందని సమాచారం.

సదరు హీరోకు స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఒక్కసారి పట్టాలెక్కిందంటే ఏకకాలంలో నిర్విరామంగా తెలుగు మరియు కన్నడ భాషల్లో షూటింగును జరుపుకుంటుందని వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అనధికారికంగా వినిపిస్తున్న మాటలు. అయితే త్వరలోనే పూరి జగన్నాధ్ అధికారికంగా ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: