నితిన్ దెబ్బకి ఆ డైరెక్టర్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందా .... ??
మిస్టర్ మజ్ను, తొలిప్రేమ సినిమాల దర్శకుడు అట్లూరి వెంకీ రూపొందించిన ఈ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నితిన్, కీర్తి సురేష్ ల జోడికి ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కింది. నిజానికి కథ పరంగా ఓల్డ్ స్టోరీనే తీసుకున్న దర్శకుడు వెంకీ దానిని యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తీయడంలో మాత్రం సఫలమయ్యారు అని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని వన్ లైన్ డైలాగులు కామెడీ పంచులు ఆడియన్స్ ని ఎంతో అలరిస్తున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా అందరి నుంచి మంచి స్పందన వస్తుంది. తొలిప్రేమ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను తో ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అలానే ప్రస్తుతం రంగ్ దే మూవీ తో మరొక మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి.
అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, రెండు రోజుల క్రితం ఒక యువ స్టార్ హీరో నుండి వెంకీ అట్లూరికి పిలుపు వచ్చిందని తనకోసం ఒక మంచి స్టోరీ ని సిద్ధం చేయమని సదరు స్టార్ హీరో చెప్పడంతో ప్రస్తుతం వెంకీ అట్లూరి ఆయన కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అన్ని వర్కౌట్ అయితే అతి త్వరలో ఒక భారీ నిర్మాణ సంస్థ రూపొందించనున్న ఈ మూవీకి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రావడం ఖాయమని చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమే అయితే రంగ్ దే ఖచ్చితంగా వెంకీ అట్లూరి లైఫ్ ని మార్చేసినట్లే అని, ఆ విధంగా నితిన్ ద్వారా వెంకీ కి మంచి టర్నింగ్ పాయింట్ దక్కినట్లే అని అంటున్నారు విశ్లేషకులు.....!!